Tuesday 20 October 2015

surendrapuri

నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియం ని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. కుండా సత్యనారయన్ కుమారుడు సురేంద్ర పేరుతొ ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు పెట్టారు. తన కుమారుడి పేరు అమరంగా ఉండడానికి ఈ మ్యూజియాన్ని స్థాపించిన సత్యనారాయన్ గారు ఈ మ్యూజియానికి సురేంద్రపురి మ్యూజియం అన్న పేరు పెట్టారు. భారత దేశం లో ఉన్నప్రఖ్యాతమైన మరియు ముఖ్యమైన ఆలయాల మినియెచర్ లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి.



ఈ వైవిధ్యమైన అంశం సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రముఖమైన ఆలయాల యొక్క ఖచ్చినమైన ప్రతిరూపాలని తయారు చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఆలయాల పైన ఉండే శిల్పకళలూ నిర్మాణ శైలి ఇలా ప్రతి విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మినీయెచర్ ఆలయాలని అద్భుతంగా తయారు చేసారు. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు


No comments:

Post a Comment